
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనాయి. ఆరంభంలో 30పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 92 పాయింట్లుఎగిసి 38074 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 11351వద్ద కొనసాగుతున్నాయి. తద్వార కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన కొనసాగుతున్నాయి. డాలరు బలపడటంతో ఐటీ సెక్టార్ పుంజుకోగా, బ్యాంకింగ్,ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ నష్టపోతోంది. జీ, బీఎఫ్ యుటిలిటీస్, డీహెచ్ఎఫ్ఎల్, టొరంటొ ఫార్మ, లాభపడుతున్నాయి. ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, మారుతి సుజుకి, సిప్లా, ఐసీఐసీఐ, లూజర్గా కొనసాగుతున్నాయి.
డాలరు మారకంలో రూపాయి బలహీనంగా ఉంది. 14పైసలు బలహీనపడిన రూపాయి 69.08 వద్ద ట్రేడ్ అవుతోంది.