పెట్రోలు ధర రూ.5 లు తగ్గింపు

Petrol Prices cut by Rs 5, Diesel Down by Rs 1 - Sakshi

వాహనదారులకు  ఊరటనిచ్చిన పంజాబ్‌ ప్రభుత్వం

పెట్రో ధరలపై వ్యాట్‌ తగ్గింపు

పెట్రోలు పై  రూ. 5,  డిజిల్‌పై రూ.1 ధర తగ్గింపు

ఒకవైపు అంతర్జాతీయంగా చమురుధరలు మళ్లీ పరుగు అందుకోగా పంజాబ్‌ ప్రభుత్వం వాహన దారులకు శుభవార్త అందించింది.   2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థికమంత్రి మన్‌ప్రీత్‌ సింగ్ బాదల్   సమర్పించిన బడ్జెట్‌లో పెట్రో ధరలపై వ్యాట్‌ను  తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో  పెట్రోలు ధర  రూ.5, డీజిల్‌ ధర  రూ.1 తగ్గనుంది.  సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. 

కొత్తగా పన్నుల వడ్డన ఏమీలేకుండానే రూ. 1,58,493 కోట్లతో  బడ్జెట్‌ను రాష్ట్ర  ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ, ఆరోగ్యం, విద్య, గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాలపై బడ్జెట్ ప్రాథమికంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top