న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేంద్రం కొత్తగా 7.75% వడ్డీ రేటుతో కొత్త బాండ్ స్కీమును ప్రకటించింది. ఏడేళ్ల మెచ్యూరిటీ వ్యవధి ఉండే ఈ బాండ్లకు జనవరి 10 నుంచి సబ్స్క్రిప్షన్స్ ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత 8 శాతం స్కీము స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్సి గర్గ్ .. ‘ట్వీట్’ చేశారు. వడ్డీ రేటును తగ్గించడానికి ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఏ కారణం చూపకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్న దరిమిలా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ స్కీములో వడ్డీని అర్ధ సంవత్సరానికోసారి లెక్కిస్తారు. దీంతో రూ.1,000 మేర ఇన్వెస్ట్ చేసిన పక్షంలో ఏడేళ్ల తర్వాత ఆ విలువ రూ.1,703గా ఉంటుంది.
ఈ బాండ్లకు పన్నులు కూడా వర్తిస్తాయి. వీటిని సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకోవడానికి వీలుండదని, అలాగే బ్యాంకులు.. ఇతరత్రా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే క్రమంలో తనఖా పెట్టడానికి కూడా ఈ బాండ్లు ఉపయోగపడవని కేంద్రం పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్లను పెట్టుబడులవైపు ప్రోత్సహించే లక్ష్యంలో 2003లో అప్పటి ప్రభుత్వం 8% వడ్డీ రేటుతో ఆరేళ్ల వ్యవధి ఉండే సేవింగ్స్ బాండ్స్ స్కీమును ప్రవేశపెట్టింది.
కొత్త సేవింగ్స్ బాండ్ స్కీము
Published Fri, Jan 5 2018 12:08 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement