టాప్‌–50లోకి  చేరడం సాధ్యమే: జైట్లీ | Sakshi
Sakshi News home page

టాప్‌–50లోకి  చేరడం సాధ్యమే: జైట్లీ

Published Fri, Nov 2 2018 1:41 AM

It is possible to reach the top 50: Jaitley - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు వ్యాపార సులభతర దేశాల జాబితాలో టాప్‌–50లోకి చేరడం సాధ్యమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు.  ప్రపంచబ్యాంకు ర్యాంకుల్లో భారత్‌ గతేడాది 100వ ర్యాంకు నుంచి ఈ ఏడాది 77వ స్థానానికి చేరుకున్న నేపథ్యంలో జైట్లీ తన స్పందనను ఓ బ్లాగులో తెలియజేశారు.

టాప్‌–50లోకి చేరడానికి భారత్‌ 27 స్థానాల దూరంలో ఉన్నట్టు చెప్పారు. అసాధ్యంగా అనిపించేది, ఇప్పుడు సాధ్యమేనని చెప్పారాయన. ‘‘మోదీ సర్కారు హయాంలో మన దేశం 65 స్థానాలు ముందుకు వచ్చింది.’’ అని అరుణ్‌ జైట్లీ వివరించారు.  

Advertisement
Advertisement