దలాల్ స్ట్రీట్లో బుల్ దూకుడు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు మరోసారి ఆల్టైం గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దలాల్ స్ట్రీట్లో బుల్ దూకుడు కొనసాగుతోంది. దీంతో కీలక సూచీలు సెన్సెక్స్ , నిఫ్టీ సరికొత్త గరిష్టాలను టచ్ చేశాయి. నిఫ్టీ 35 పాయింట్లు ఎగిసి 11,600స్థాయిని అధిగమించింది. సెన్సెక్స్, 132 పాయింట్లు పుంజుకుంది. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే. అయితే బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనిపిస్తోంది. సన్ ఫార్మా, డాబర్, టెక్మహీంద్ర, తదితర షేర్లు లాభపడుతుండగా ఐవోసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, జెట్ ఎయిర్వేస్ నష్టపోతోంది.