
రూ.4 వేలకే ఎయిర్టెల్ 4జీ హ్యాండ్సెట్ !
భారతీ ఎయిర్టెల్ చౌక ధరల్లో 4జీ ఫోన్లను అందించాలని యోచిస్తోంది. రిలయన్స్ జియో 4జీ సర్వీసుల కోసం చౌక హ్యాండ్సెట్లను
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్టెల్ చౌక ధరల్లో 4జీ ఫోన్లను అందించాలని యోచిస్తోంది. రిలయన్స్ జియో 4జీ సర్వీసుల కోసం చౌక హ్యాండ్సెట్లను అందించే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, దానిని ఎదుర్కొనేందుకు భారతీ ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి రూ.4,000-12,000 రేంజ్లో ఎయిర్టెల్ బ్రాండ్ డ్యుయల్ మోడ్ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తేవాలని కసరత్తు చేస్తోంది. ఈ హ్యాండ్సెట్స్ ఎయిర్టెల్ బ్రాండ్తో ఉండాలా? కో బ్రాండెడ్గా ఉండాలా అన్న విషయమై సంప్రదింపులు జరుగున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
ఈ విషయమై ఎయిర్టెల్ చైనా కంపెనీలతోనూ, ఇటీవలనే భారత్లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించిన ఫాక్స్కాన్తోనూ చర్చలు జరిపిందని సమాచారం. భారత్లో 4జీ సర్వీసులందించిన తొలి కంపెనీ ఎయిర్టెల్ కంపెనీయే. ఈ కంపెనీ మూడేళ్ల క్రితం కోల్కతాలో 4జీ సేవలను ప్రారంభించింది.