స్పీకర్పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ | ysrcp gives no confidence motion on assembly speaker | Sakshi
Sakshi News home page

స్పీకర్పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ

Mar 19 2015 3:34 PM | Updated on Jul 29 2019 2:44 PM

స్పీకర్పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ - Sakshi

స్పీకర్పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ

ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు.

ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు రవికుమార్, సురేష్, పుష్ప శ్రీవాణి తదితరులు అసెంబ్లీ కార్యదర్శి సత్యానారాయణకు ఈ నోటీసులు అందించారు.

నోటీసుపై పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేశారు. ఈ అవిశ్వాస తీర్మానం మీద చర్చించేందుకు మళ్లీ పిలిస్తే తప్ప తాను అసెంబ్లీకి కూడా వెళ్లేది లేదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement