స్పీకర్పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ | Sakshi
Sakshi News home page

స్పీకర్పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ

Published Thu, Mar 19 2015 3:34 PM

స్పీకర్పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ - Sakshi

ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు రవికుమార్, సురేష్, పుష్ప శ్రీవాణి తదితరులు అసెంబ్లీ కార్యదర్శి సత్యానారాయణకు ఈ నోటీసులు అందించారు.

నోటీసుపై పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేశారు. ఈ అవిశ్వాస తీర్మానం మీద చర్చించేందుకు మళ్లీ పిలిస్తే తప్ప తాను అసెంబ్లీకి కూడా వెళ్లేది లేదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement