కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య | women suicide in ysr distirict | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

Aug 13 2015 2:12 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

చుండుపల్లె: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వైఎస్సార్ జిల్లా చుండుపల్లి మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని శివాజీనగర్‌కు చెందిన జొన్నలగడ్డ చిరంజీవి, రెడ్డెమ్మలకు వివాహమై నాలుగేళ్లయింది. తరచూ వారి మధ్య కలతలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే గురువారం వేకువజామున ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement