ఆర్డీఓ ఆఫీస్ ను ముట్టడించిన చేనేత కార్మికులు | weavers suffering with TDP leader gaddam sai | Sakshi
Sakshi News home page

ఆర్డీఓ ఆఫీస్ ను ముట్టడించిన చేనేత కార్మికులు

May 21 2015 1:53 PM | Updated on Aug 10 2018 8:13 PM

అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీఓ కార్యాలయాన్ని గురువారం చేనేత కార్మికులు ముట్టడించారు.

ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీఓ కార్యాలయాన్ని గురువారం చేనేత కార్మికులు ముట్టడించారు. టీడీపీ నేత గడ్డం సాయి వేధింపుల బారి నుంచి రక్షించాలని చేనేత కార్మికులు కోరారు. చేనేత కార్మికులను బానిసలుగా చూస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ నేత గడ్డం సాయి కార్మికులను వేధిస్తోన్న నేపథ్యంలో ఆగ్రహించిన వారు ధర్మవరం ఎమ్మెల్యే  సూర్యనారాయణతో వాగ్వివాదానికి దిగారు. తమ రుణాలు మాఫీ చేయాలంటూ కార్మికులు ఎమ్మెల్యేను గట్టిగా కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement