లారీని ఢీ కొన్న సుమో: ఇద్దరు మృతి | Two killed, five injured in Road accident in Nellore district | Sakshi
Sakshi News home page

లారీని ఢీ కొన్న సుమో: ఇద్దరు మృతి

Apr 29 2014 9:24 AM | Updated on Oct 20 2018 6:04 PM

లారీని ఢీ కొన్న సుమో: ఇద్దరు మృతి - Sakshi

లారీని ఢీ కొన్న సుమో: ఇద్దరు మృతి

పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి వస్తున్న టాటా సుమో కారు టైర్ పంక్చర్ కావడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో సుమోలోని ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులుకు సమాచారం అందించారు.

 

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా చిత్తూరు జిల్లా వాసులని... విజయవాడలోని కనకదుర్గను దర్శించుకుని స్వస్థలానికి వస్తున్న క్రమంలో ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరి మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement