మదనపల్లెలోమహిళా దొంగ అరెస్ట్ | theft arrested in madanapalle | Sakshi
Sakshi News home page

మదనపల్లెలోమహిళా దొంగ అరెస్ట్

Jan 19 2016 11:32 AM | Updated on Aug 11 2018 6:04 PM

మదనపల్లెలోమహిళా దొంగ అరెస్ట్ - Sakshi

మదనపల్లెలోమహిళా దొంగ అరెస్ట్

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల బ్యాగులు చోరీ చేస్తున్న మహిళను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు.

మదనపల్లె : చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల బ్యాగులు చోరీ చేస్తున్న మహిళను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి రూ.5 లక్షల రూపాయల విలువైన 250 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. బి. కొత్త కోటకు చెందిన పఠాన్ రహంతుల్లా భార్య నౌహిరా(40) బస్టాండులో ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని చోరీలను పాల్పడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కాపు కాసిన పోలీసులు ఆమెను పట్టుకున్నారు. అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement