ప్రాణం తీసిన బైక్ వివాదం | Taken to the bike dispute | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన బైక్ వివాదం

Oct 24 2013 3:11 AM | Updated on Aug 29 2018 4:16 PM

కొత్త బైక్ కొనుగోలు చేయాలన్న విషయంలో తలెత్తిన వివాదం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్య పురుగుమందు తాగడాన్ని అవమానంగా భావించిన భర్త కూడా తాగాడు.

సాక్షి, నల్లగొండ : కొత్త బైక్ కొనుగోలు చేయాలన్న విషయంలో తలెత్తిన వివాదం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్య పురుగుమందు తాగడాన్ని అవమానంగా భావించిన భర్త కూడా తాగాడు. ఈ ఘటనలో భర్త చనిపోగా.. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన నల్లగొండ పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గుర్రంపోడు మండలం బొల్లారానికి చెందిన తరి గోపాల్ (35) అదే మండలంలోని పోలీస్ స్టేషన్‌లో 8 ఏళ్లుగా హోంగార్డుగా పనిచేస్తున్నాడు.

ఇతనికి భార్య సుజాత, ఇద్దరు కూతుళ్లు, ఒక క కుమారుడు ఉన్నారు. కొత్త బైక్ కొనుగోలు చేయాలన్న విషయంలో భార్యభర్త మధ్య వివా దం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సుజాత మంగళవారం పురుగుల మందు తాగింది. హుటాహుటిన ఆమెను నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆమెను చూడడానికి వచ్చిపోయే బంధువులు, స్నేహితులు ఘటన విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలో భర్త అవమానంగా భావించి నల్లగొండ-దుప్పలపలి దారిలో పురుగుల మందు తాగాడు. స్థానికులు చూసి ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. వన్‌టౌన్ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement