విశాఖపట్నం: గోపాలపట్నంలో నిన్న రైలు కిందపడి చనిపోయిన ఎస్ఐ వీరాంజనేయులు సూసైడ్ నోట్ కీలకంగా మారింది. తన చావుకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఏసీబీ అధికారుల వేధింపులే కారణమని ఎస్ఐ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా వంగరలో 2014లో వీరాంజనేయులు ఎస్ఐగా పని చేశారు. ఆ సమయంలో ఓ కేసు విషయంలో ఒక వ్యక్తి నుంచి 5 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి వీరాంజనేయులను అదుపులోకి తీసుకున్నారు.
గోపాలపట్నంలోని లక్ష్మీనగర్కు చెందిన గుడిబండ వీరాంజనేయులు(29) మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో గోపాలపట్నం ఆర్ఆర్ఐ కేబిన్ సమీపాన రైలు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇది ఆత్మహత్యా, రైలు ప్రమాదమా అన్న వివరాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
వీరాంజనేయులు తండ్రి షిప్యార్డులో పనిచేసి కొంత కాలం క్రితం మరణించారు. అతనికి తల్లి కాంతమ్మ ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వీరాంజనేయులు ఎంబీఏ చదివారు. 2008 బ్యాచ్కు చెందిన ఆయన తొలిసారి వంగర పోలీస్స్టేషన్లో ఎస్ఐగా చేరారు. ఓ కేసు పరిష్కారం అనంతరం ఎస్ఐ ఆంజనేయులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన కడుమల సత్యనారాయణ 2014 అక్టోబర్ 24న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు ఏసీబీ అధికారులు వీరాంజనేయులుపై నిఘా వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సస్పెన్షన్లో ఉన్న వీరాంజనేయులు ప్రస్తుతం ఇక్కడ తల్లి వద్దే ఉంటున్నారు. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదం వల్ల మరణించారా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది.
ఎమ్మెల్యే కళా వేధింపులే కారణం:ఎస్ఐ సూసైడ్ నోట్ !
Published Wed, Apr 22 2015 4:49 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
- ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
- భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
- సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement