సాక్షి విలేకరి నాగేశ్వరరావు మృతి | Sakshi journalist Nageswarao passes away | Sakshi
Sakshi News home page

సాక్షి విలేకరి నాగేశ్వరరావు మృతి

Aug 6 2013 3:38 AM | Updated on Sep 1 2017 9:40 PM

సాక్షి ఒంగోలు స్టాఫ్ రిపోర్టర్ అల్లంశెట్టి నాగేశ్వరరావు (40) సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో ఒంగోలులోని సంఘమిత్ర ఆస్పత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు.

ఒంగోలు, న్యూస్‌లైన్: సాక్షి ఒంగోలు స్టాఫ్ రిపోర్టర్ అల్లంశెట్టి నాగేశ్వరరావు (40) సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో ఒంగోలులోని సంఘమిత్ర ఆస్పత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. నాగేశ్వరరావు స్వగ్రామం ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. నాగేశ్వరరావు గతంలో గుంటూరు జిల్లా తెనాలి, బాపట్లల్లో ఈనాడు రిపోర్టర్‌గా పనిచేశారు. 2007లో సాక్షి ప్రారంభ దశలో స్టాఫ్ రిపోర్టర్‌గా ప్రకాశం జిల్లాకు ఎంపికయ్యారు. అప్పటినుంచి ఒంగోలులో పనిచేస్తున్నారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు. మంగళవారం ఉదయం పూసపాడులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement