కడప కలెక్టరేట్, న్యూస్లైన్ : మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి మాలతి అన్నారు. మహిళా భద్రతా పక్షోత్సవాల సందర్భంగా బుధవారం టీటీడీసీలో డీఆర్డీఏ జెండర్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
దేశంలో మహిళల భద్రత కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా అమలుకావడం లేదని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, అత్యాచారాలు, గృహ హింస తదితర సమస్యలను చొరవ తీసుకొని నిరోధించాల్సిన అవసరముందన్నారు. మహిళా సమస్యలను వెలికితీయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. సమావేశానికి అధ్యక్షత వహించిన డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ మహిళలు సమష్టిగా తమ సమస్యలను ఎదుర్కోవాలని చెప్పారు. భ్రూణహత్యలపై తమకు సమాచారం అందించాలన్నారు.
మహిళా పోలీస్స్టేషన్ సీఐ సుధాకర్ మాట్లాడుతూ మహిళలపై హింస శోచనీయమన్నారు. విలువలతో కూడిన భావితరాలను అందించడం ద్వారానే నేరాలు తగ్గుముఖం పట్టగలవన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లీలావతి మాట్లాడుతూ గర్భస్థ దశ నుంచి వృద్ధాప్యం వరకు మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె వివరించారు. కలసపాడు మండలంలో భ్రూణ హత్యలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి అపూర్వ సుందరి, స్టెప్ సీఈఓ మమత, డీఆర్డీఏ ఏపీడీలు సుందర్రాజు, నాగరాజు, జిల్లా శిశు రక్షణ అధికారి శివప్రసాద్రెడ్డి, జెండర్ డీపీఎం వసుంధర పాల్గొన్నారు.
మహిళా సమస్యలపై స్పందించాలి
Published Thu, Dec 12 2013 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement