టవేరా బోల్తా: ఏడుగురికి గాయాలు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరు మండలం కరటంపాడు వద్ద ఓ టవేరా కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఏడుగురికి తీవ గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి గురైన వారు బెంగళూరు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.