టవేరా బోల్తా: ఏడుగురికి గాయాలు

Passengers Injured In Road Accident At Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరు మండలం కరటంపాడు వద్ద ఓ టవేరా కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఏడుగురికి  తీవ​ గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన వారిలో నలుగురి  పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి గురైన వారు బెంగళూరు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top