వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి | Negligence of the doctors a boy died | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి

May 12 2015 3:25 AM | Updated on Oct 20 2018 5:53 PM

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి - Sakshi

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి

మదనపల్లె పట్టణంలోని ఓ ప్రయివేట్ చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో11 నెలల బాలుడు మృతి చెందాడు...

- నర్సింగ్‌హోం ఎదుట బంధువుల ఆందోళన
- బాధితులకు పరిహారంతో వివాదానికి తెర
మదనపల్లె రూరల్:
మదనపల్లె పట్టణంలోని ఓ ప్రయివేట్ చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో11 నెలల బాలుడు మృతి చెందాడు. మృతుని తలిదండ్రులు నర్శింగ్ హోం ఎదుట ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి పరిహారం అందజేయడంతో వివాదానికి తెరపడింది. ఈ సంఘటన సోమవారం వేకువజామున ఆర్‌టీసీ బస్టాండు సమీపం లోని ఓ చిన్నపిల్లల నర్శింగ్‌హోంలో జరిగింది. గుర్రంకొండ మండలం సంగసముద్రంకు చెందిన కలిపిల్లి మల్లి కార్జున అతని భార్య శివలక్ష్మిలు ఆదివారం తన పిల్లల సుప్రియ(6), లోకేష్ ఏడాది కుమారునితో బోయకొండకు మొక్కుబడి చెల్లించేందుకు వెళ్లారు.

అమ్మవారికి మొక్కుబడి చెల్లించి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో బాలుడు లోకేష్‌కు వాంతులు, వీరేచనాలు కావడంతో జ్వరం వ చ్చి ంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండులోని ఓ నర్శింగ్ హోంకు చేరకుని   చికిత్స చేయించారు. అనంతరం డాక్టర్ సలహామేరకు ఆస్పత్రిలోనే అడ్మిట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో బాలునికి అస్వస్థత అయింది. ఆ సమయంలో వైద్యసిబ్బంది, డాక్టరు అందుబాటులో లేకపోవడంతో బాలుడు చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమబిడ్డ చనిపోయాడని బందువులు ఆందోళనకు దిగి టుటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంటనే పోలీసులు పెద్ద మనుషులు కల్పించుకుని బాధితులలతో చర్చిలు జరిపి పరిహారం అందజేసి వివాదానికి తెరదించారు.

Advertisement
 
Advertisement
Advertisement