‘సంక్షేమ నిధి’ బాధ్యతలు స్వీకరించిన లోకేశ్ | nara lokesh takes over as coordianter of welfare trust | Sakshi
Sakshi News home page

‘సంక్షేమ నిధి’ బాధ్యతలు స్వీకరించిన లోకేశ్

Jun 20 2014 2:11 AM | Updated on Aug 29 2018 3:37 PM

టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నియమితులైన నారా లోకేశ్ గురువారం ఎన్‌టీఆర్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు.

సాక్షి, హైదరాబాద్: టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నియమితులైన నారా లోకేశ్ గురువారం ఎన్‌టీఆర్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా సంక్షేమ నిధిని వినియోగిస్తామన్నారు. సంక్షేమ నిధికి 14 కోట్లు నిధి రూపంలో వచ్చాయని, మరో ఆరు కోట్లు పార్టీపరంగా కేటాయించి 20 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement