రెండేళ్లలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పూర్తి.. | MP Raghu Rama Krishnam Raju Said Water Grid Project Would Be Completed In Two Years | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పూర్తి..

Jan 17 2020 1:19 PM | Updated on Jan 17 2020 1:35 PM

MP Raghu Rama Krishnam Raju Said Water Grid Project Would Be Completed In Two Years - Sakshi

సాక్షి, నరసాపురం: జిల్లాలో గోదావరి చెంత నుంచి శుద్ధి చేసిన జలాలను పైపులైన్‌ ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళిక ఆమోదం పొందిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 3,670 కోట్లతో ఈ పథకం చేపడుతున్నట్లు తెలిపారు.  ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిందని చెప్పారు.  వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తోన్న పశ్చిమగోదావరి జిల్లా ప్రజల కల నిజం కాబోతుందని.. రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతికి ఇచ్చిన కానుక అని పేర్కొన్నారు. వాటర్‌ సప్లైకి ప్రతి ఇంటికి మీటర్‌ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement