కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు | moderate rainfall in coastal andhra pradesh | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు

Jul 11 2015 9:40 AM | Updated on Sep 3 2017 5:19 AM

తూర్పు మధ్యప్రదేశ్ - ఉత్తరప్రదేశ్ మధ్య వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది.

విశాఖపట్నం: తూర్పు మధ్యప్రదేశ్ - ఉత్తరప్రదేశ్ మధ్య వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. కాగా ఈ వాయుగుండం తెలుగు రాష్ట్రాలపై వాయుగుండ ప్రభావం ఉండదని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement