ఆ సబ్ కమిటీలో సభ్యుడిగా ఉండనని సీఎంకు చెప్పా! | Sakshi
Sakshi News home page

ఆ సబ్ కమిటీలో సభ్యుడిగా ఉండనని సీఎంకు చెప్పా!

Published Sun, Nov 23 2014 10:49 AM

ఆ సబ్ కమిటీలో సభ్యుడిగా ఉండనని సీఎంకు చెప్పా!

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో తాను సభ్యుడిగా ఉండనని సీఎం చంద్రబాబు నాయుడికి చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. రాజధాని విషయంలో స్పష్టత రావడానికి ఒకటి, రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

 

రాజధాని విషయంలో్ రైతులను సంతృప్తి పరిచి 30 వేల ఎకరాలు సమీకరించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గతంలోనే అన్ని పంటలకు ఒకే పరిహారం ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆ ఉపసంఘలోని మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement