విజయనగరం జిల్లా గుర్లా మండలంలోని దేవునిపాక గ్రామంలో ఎక్సైజ్ అధికారులు గురువారం విస్తృత స్థాయిలో దాడులు జరిపారు.
విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా గుర్లా మండలంలోని దేవునిపాక గ్రామంలో ఎక్సైజ్ అధికారులు గురువారం విస్తృత స్థాయిలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో సుమారు 1300 లీటర్ల నాటు సారాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా 2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కాగా, ఎక్సైజ్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఈ దాడులు జరిపారు. అయితే, ఈ దాడుల విషయం ముందే తెలియడంతో నిందితులందరూ పరారయ్యారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
(గుర్లా)