సిట్‌ విచారణతో ప్రయోజనం లేదు | cpi leader stalin demands CBI probe into Vizag land scam | Sakshi
Sakshi News home page

సిట్‌ విచారణతో ప్రయోజనం లేదు

Jun 22 2017 12:02 PM | Updated on Sep 5 2017 2:14 PM

విశాఖ భూకబ్జాలపై సిట్‌ విచారణతో ఎలాంటి ప్రయోజనం లేదని స్టాలిన్‌ అన్నారు

విశాఖపట్నం: విశాఖ భూకబ్జాలపై ప్రభుత్వం జరిపిస్తున్న సిట్‌ విచారణతో ఎలాంటి ప్రయోజనం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్‌ అన్నారు. గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సేవ్ విశాఖ' మహాధర్నాలో పాల్గొన్న ఆయన విశాఖ భూ కబ్జాలపై మండిపడ్డారు.

మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు భూములు కొల్లగొడుతున్నారని స్టాలిన్‌ ఆరోపించారు. ప్రైవేటు, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించారని.. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement