
సాక్షి, వైఎస్సార్ జిల్లా : విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్ ఎదుటే ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. ప్రొద్దుటూరు ఒకటో పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాసులు రెడ్డి అనే చీటీ ఏజెంట్ ప్రజలను మోసం చేసి పారిపోయాడు. ఆచూకీ చెప్పాలని అతని స్నేహితుడైన మురళిని పోలీసులు స్టేషన్కు పిలిపించి విచారించారు. ఈ నేపథ్యంలో తనకు ఏ సమాచారం తెలియదని చెప్తున్నా నాలుగు రోజులుగా పోలీసులు వినిపించుకోవట్లేదని బాధితుడు ఆవేదనకు గురయ్యాడు. పోలీసుల తీరుతో విసిగిపోయిన మురళి దంపతులు శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో స్పందించిన పోలీసులు దంపతులను చికిత్స కోసం హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.