సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమ ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలతో విడివిడిగా లేదా సంయుక్తంగానైనా చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికల అవసరాల కోసం అవకాశవాదానికి పాల్పడవద్దని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందానికి స్పష్టమైన సూచనలు చేయాలని కోరింది. రెండు రోజుల పాటు జరిగే సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితిపై ఆమోదించిన తీర్మానాన్ని మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు చెబుతున్న ధర్మం, న్యాయం ఏమిటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే విభజన బిల్లు పెట్టాలంటున్న వెంకయ్య నాయుడు ఇప్పటి దాకా ఆ మాట ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీమాంధ్రకు ఏం కావాలో వెంకయ్య చెప్పాలని నిలదీశారు.
అవకాశవాదాన్ని విడనాడాలని, అస్పష్టంగా మాట్లాడవద్దని హితవుపలికారు. సీమాంధ్ర ఉద్యమకారుల సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. తనకు చేతకానప్పుడు ఉద్యమకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రప్రభుత్వం ముందుంచాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సంక్షోభానికి తమ పార్టీ సూచిస్తున్న పరిష్కారం.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమేనని చెప్పారు. తాము ఇప్పటికీ భాషాప్రాతిపదిక రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రపతి పాలనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పారు. విజయనగరంలో దాడులు, ఉద్రిక్త పరిస్థితులకు బొత్స, ఆయన కుటుంబ సభ్యుల అరాచకాలే కారణమని పార్టీ అభిప్రాయపడినట్టు వివరించారు. కర్ఫ్యూ అనంతరం అమాయకులు.. బొత్స అంటే గిట్టనివాళ్లపై కేసులు పెట్టి వేధించనున్నారని తెలిపారు. ఢిల్లీలో వైఎస్ విజయమ్మ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నేతలు తమ పార్టీ నాయకుల్ని కలవడంలో ప్రత్యేకత ఏమీ లేదని, అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించినట్టే తమనూ కలిశారని రాఘవులు చెప్పారు.
పార్టీలతో కేంద్రం చర్చలు జరపాలి
Published Fri, Oct 11 2013 3:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement