ఏపీ ఎంసెట్ (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది.
దివ్యాంగులు, ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్సు, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీల అభ్యర్థులు విజయవాడ బెంజ్సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ పరిశీలన కేంద్రం లో మాత్రమే పరిశీలనకు హాజరుకావాలి. వీరికి 8 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వీరు హాజరు కావాల్సిన తేదీలు ‘హెచ్టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ. ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచారు. వెబ్ ఆప్షన్ల నమోదుకు ఈ నెల 11నుంచి 20 వరకు చేసుకోవచ్చును. జూన్ 25వ తేదీన వెబ్ ఆధారిత సీట్ల కేటాయింపు జరుగుతుంది.