వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
లక్కిరెడ్డిపల్లి: వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని లక్కిరెడ్డి పల్లి మండలంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండల కేంద్రం శివారులో ఎదురుగా వస్తున్న సుమోను తప్పించబోయి ఓ బైకు మరో బైకును ఢీకొట్టింది. దీంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారు కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు రామాపురం మండలం నీలకంఠపురం వాసులని పోలీసులు తెలిపారు.