lakkireddypalli
-
పాలవ్యాన్ ఢీకొని విద్యార్థికి గాయాలు
లక్కిరెడ్డిపల్లె: స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతున్న ఓ విద్యార్థి ని పాలవ్యాను ఢీకొంది. శనివారం ఉదయం లక్కిరెడ్డిపల్లె గంగమ్మ ఆలయం వద్ద జరిగిన ఈ సంఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. లక్కిరెడ్డిపల్లెలోని విశ్వభారతి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చింతల సందీప్ శనివారం ఉదయం పాఠశాలలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన సందీప్ ను కడప రిమ్స్ కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన పాలవ్యాన్ డ్రైవర్ను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రెండు బైకులు ఢీ: నలుగురికి గాయాలు
లక్కిరెడ్డిపల్లి: వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని లక్కిరెడ్డి పల్లి మండలంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండల కేంద్రం శివారులో ఎదురుగా వస్తున్న సుమోను తప్పించబోయి ఓ బైకు మరో బైకును ఢీకొట్టింది. దీంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారు కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు రామాపురం మండలం నీలకంఠపురం వాసులని పోలీసులు తెలిపారు. -
మాజీమంత్రి రాజగోపాల్ రెడ్డి మృతి
తిరుపతి: మాజీమంత్రి రాజగోపాల్ రెడ్డి గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజగోపాల్ రెడ్డి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.