‘నమస్తే’తో మనసులు గెలుచుకున్న రాజ్‌నాథ్‌

మాస్కో: ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ సంస్కృతిలో భాగమైన ‘నమస్తే’ పదం బాగా ప్రాచుర్యం పొందింది. కరోనా నుంచి తప్పించుకోవడానికి షేక్‌హ్యాండ్‌ బదులు చేతులతో నమస్కారం చేయడం శ్రేయస్కరమని పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్నాయి. కాగా ప్రస్తుతం భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యాలో జరగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కీలక సమావేశంలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి నిన్న రాత్రి మాస్కో చేరుకున్నారు. రష్యన్ సైనికాధికారుల్లో ఒకరు షేక్ హ్యాండ్ ఇవ్వబోగా సున్నితంగా తిరస్కరించిన రాజ్ నాథ్  ‘నమస్తే’ అంటూ చేతులు జోడించారు. మరో సైనికాధికారి సైతం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించగా నమస్కారం చేయడంతో ఆ అధికారి సైతం  ప్రతి నమస్కారం చేయడం విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top