ఆసియా కప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ మళ్లీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తిరుగులేని ప్రదర్శన కనబరుస్తూ ఆదివారం జరిగిన సూపర్–4 మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.