భారత్తో జరుగుతున్నమూడో టెస్ట్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 151 పరుగులకే ముగిసింది. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దాటికి ఆతిథ్య బ్యాట్స్మెన్ పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో భారత్కు 292 పరుగుల ఆధిక్యం లభించింది. 8/0 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే ఓపెనర్లు ఆరోన్ ఫించ్(8), హ్యారిస్(22) వికెట్లను కోల్పోయింది.