పంత్‌పై పాట.. దద్దరిల్లిన సిడ్నీ మైదానం! | Sakshi
Sakshi News home page

పంత్‌పై పాట.. దద్దరిల్లిన సిడ్నీ మైదానం!

Published Fri, Jan 4 2019 3:53 PM

 ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన స్లెడ్జింగ్‌తో హాట్‌టాపిక్‌గా నిలిచిన టీమిండియా యువ వికెట్‌ కీపర్ రిషభ్‌ పంత్‌.. చివరి టెస్ట్‌లో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఆటగాళ్లకు మాటకు మాట బదులిస్తూ వార్తల్లో నిలిచిన పంత్‌.. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సెంచరీ బాది.. ఆసీస్‌ గడ్డపై ఈ ఘనతను అందుకున్న తొలి భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు.