టెక్సాస్‌లో కారు ప్రమాదం ముగ్గురు హైదరాబాద్‌ వాసులు మృతి | Three NRIS Killed In Road Accident At Texas | Sakshi
Sakshi News home page

టెక్సాస్‌లో కారు ప్రమాదం ముగ్గురు హైదరాబాద్‌ వాసులు మృతి

Feb 25 2020 6:41 PM | Updated on Mar 21 2024 11:40 AM

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలయ్యారు.  భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున డెల్ వెబ్ బోల్వార్డ్, ఇంటర్ సెక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ఫ్రిస్కో పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారి వద్ద లభించిన ఆధారాల మేరకు చనిపోయిన వారు దివ్య ఆవుల (34), ఆమె భర్త రాజా గవిని (41) మరణించారు. వారితో పాటే ప్రయాణిస్తున్న ప్రేమనాథ్ రామనాథం (42) కూడా స్పాట్‌లోనే మృత్యువాతపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement