హోదా కోసం మొదటినుంచి వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటాలు చేశామని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యక్తిగత కారణాలతోనే చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారని మండిపడ్డారు. హోదా కాకుండా కేంద్రం ప్యాకేజీ ఇస్తానంటే చంద్రబాబు ఏం మాట్లాడలేదని గుర్తుచేశారు.