మహానేతకు నివాళులు అర్పించిన వైఎస్ జగన్‌ | Sakshi
Sakshi News home page

మహానేతకు నివాళులు అర్పించిన వైఎస్ జగన్‌

Published Wed, May 29 2019 3:55 PM

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులు అర్పించి ఆశీర్వాదం పొందారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ సమాధిపై పూలమాల వేసి ఆయన కొద్దిసేపు మౌనంగా ప్రార్థనలు చేశారు. జగన్‌తో పాటు ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, పలువురు పార్టీ నేతలు ఉన్నారు. అంతకు ముందు ఇడుపులపాయ చేరుకున్న జననేతకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్‌ జగన్‌ను కలుసుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. 

Advertisement
Advertisement