దారుణం : గాడిదల్ని దొంగలించారని... | Watch, 3 Dalits Thrashed Over Donkey Theft In Rajasthan | Sakshi
Sakshi News home page

దారుణం : గాడిదల్ని దొంగలించారని...

Feb 23 2020 6:47 PM | Updated on Mar 21 2024 8:24 PM

జైపూర్‌ : నాగౌర్‌లో దళిత అన్నదమ్ములపై దాటి ఘటన మరువక ముందే రాజస్తాన్‌లో మరో ఘటన కలకలం రేపింది. గాడిదలను దొంగతనం చేశారనే అనుమానంతో  ముగ్గురు దళితులను చితకబాదారు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని జైసల్మీర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసు తెలిపిన వివరాల మేరకు.. జైసల్మీర్‌లో ఈ నెల 15న గాడిదలను దొంగతనం చేశారనే అనుమానంతో ఓ ముగ్గరు దళితులను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా చితకబాదారు. కర్రలతో, కాళ్లతో కొడుతూ దారుణంగా ప్రవర్తించారు.

ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఈ శనివారం వైరల్‌ కావటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోయినప్పటికి, వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement