వారం రోజులు స్ట్రైక్‌ చేస్తే ప్రభుత్వాలు అల్లాడుతాయి | Undavalli Arun Kumar Fires On CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

వారం రోజులు స్ట్రైక్‌ చేస్తే ప్రభుత్వాలు అల్లాడుతాయి

Sep 3 2018 11:46 AM | Updated on Mar 22 2024 11:06 AM

మందుబాబులు ఓ వారం రోజులు స్ట్రైక్‌ చేస్తే ప్రభుత్వాలు అల్లాడిపోతాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.8.50కి తయారయ్యే మద్యంను రూ.50కి అమ్ముతున్నారని, దీంట్లో 37 రూపాయలు ప్రభుత్వం దోచేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై చాలా మంది తనను సంప్రదిస్తున్నారని, ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వస్తామంటున్నారని పేర్కొన్నారు. అమరావతి బాండ్లు, వడ్డీరేట్లపై చర్చ జరుగుతోందని, ట్యాక్స్‌ ఎంతో తెలియకుండా బాండ్లు ఎలా ఇష్యు చేస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. కండిషన్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసే పరిస్థితి నెలకొందన్నారు. పేద, ధనికుల మధ్య అంతరాన్ని తొలగించాలని, పేదల ఆర్థిక స్థితులను మార్చాలని సూచించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement