ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సమ్మెను వీడి విధుల్లో చేరాలని, లేదంటే వారిపై వేటు తప్పదని హెచ్చరించింది. శనివారం సాయంత్రం 6 గంటల లోపు ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేయాలని, అలా చేయని వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని స్పష్టం చేసింది. తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కారి్మకులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కలి్పస్తామని పేర్కొంది. విధుల్లో చేరని వారిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దని నిర్ణయం తీసుకుంది. ఇకపై కారి్మక సంఘాల నేతలతో ఎలాంటి చర్చలు జరపొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. చర్చల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రద్దయిపోయింది. ఆగమేఘాల మీద రవాణా శాఖ కమిషనర్గా సందీప్ సుల్తానియాను నియమించింది.
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తీవ్ర నిర్ణయం
Published Sat, Oct 5 2019 7:59 AM
Advertisement
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement