సుప్రీం కోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్కు చుక్కెదురైంది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్పై గతంలో విధించిన స్టేను పొడిగించాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానం కొట్టివేసింది. సంస్ధ హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించారని మార్గదర్శిపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే.