హాజీపూర్‌ హత్యల కేసులో సంచలన తీర్పు | Sakshi
Sakshi News home page

హాజీపూర్‌ హత్యల కేసులో సంచలన తీర్పు

Published Thu, Feb 6 2020 7:20 PM

హాజీపూర్‌ హత్యల కేసులో పోక్సో స్పెషల్‌ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హాజీపూర్‌ హత్యలకు సంబంధించిన మూడు కేసుల్లోనూ శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ముగ్గురు చిన్నారి బాలికలపై అత్యాచారం జరిపి.. శ్రీనివాస్‌రెడ్డి అత్యంత దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపాయి.

Advertisement
Advertisement