ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై వెకిలిగా మాట్లాడటం భావ్యం కాదని టీడీపీ ప్రభుత్వానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హితబోధ చేశారు. శుక్రవారం స్థానికంగా జరిగిని ఓ సమావేశానికి హాజరైన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షనేతపై జరిగిని దాడిపై ప్రభుత్వం సాకులు చెప్పడం సరికాదన్నారు. ఈ దాడిపై లోతైన దర్యాప్తు జరగాలని కోరారు.