సాక్షి, కృష్ణా: జిల్లాలోని ముసునూరు మండలం వలసపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకొంది. భార్య కళ్లుగప్పిన ఓ భర్త కన్న కూతురిని అమ్మేశాడు. వివరాలు.. నవీన్బాబు అనే వ్యక్తి ఆడపిల్లలు పుడుతున్నారని తల్లిదండ్రులతో కలిసి భార్య రజనీని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈక్రమంలోనే మరోసారి తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన నవీన్బాబు నాలుగో కూతురిని లక్షా 50 వేల రూపాయలకు అమ్మేశాడు. అయితే, డబ్బుల పంపిణీలో నవీన్బాబుకు అతని తల్లిదండ్రులకు మధ్య వాగ్వివాదం జరగటంతో విషయం బయటపడింది.
తల్లి కళ్లుగప్పి బిడ్డను అమ్మేసిన తండ్రి
Aug 30 2020 8:27 PM | Updated on Mar 22 2024 11:11 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement