ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా కేంద్రం అదుకుంటుంటే, పథకం ప్రకారం తమ పార్టీని దెబ్బ తీసేందుకు టీడీపీ నేతలు చూస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు పొత్తుతో అధికారంలోకి వచ్చాక బీజేపీపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఏపీకి 10 ఏళ్లలో ఏమి చేయాలనేది విభజన చట్టంలో పెట్టారని, వాటిలో చాలా వరకు కేంద్రం అమలు చేసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 22 ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్ కేంద్రం ఇచ్చిందని తెలిపారు.