విభజనతో నష్టపోయినప్పటికీ మిగతా రాష్ట్రాలకంటే వేగంగా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతున్నదని గవర్నర్ నరసింహన్ చెప్పారు. 11.3 శాతం వృద్ధిరేటుతో రాష్ట్రం పరుగులు పెడుతున్నదని, అది జాతీయ సగటు 6.97 కంటే చాలా ఎక్కువని తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.