‘మెహబూబా’ ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ విడుదల

స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తెరెకెక్కిస్తున్న ‘మెహబూబా’ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ను శుక్రవారం విడుదలచేశారు. 1971 నాటి భారత్, పాకిస్థాన్ ల యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరిలో పూరీ తనయుడు ఆకాష్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ తుపాకీ సినిమాలో కీలక పాత్రలో నటించిన గౌతమ్ కురుప్  విలన్ గా నటించారు. సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. పూరి జగన్నాథ్ కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top