సంగీతానికి కూడా సంకెళ్లా ‘కృష్ణా’!

 ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, మెగసెసే అవార్డు గ్రహీత టీఎం కృష్ణ శనివారం, ఆదివారం ఢిల్లీలో ఇవ్వాల్సిన సంగీత విభావరిని నిర్వాహకులు అనూహ్యంగా రద్దు చేశారు. ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీ చాణక్యపురి ప్రాంతంలోని నెహ్రూ పార్క్‌లో స్పిక్‌–మాకే అనే సాంస్కృతిక సంస్థతో కలిసి స్పాన్సర్‌ చేయాలని ‘భారత ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ (ఏఏఐ)’ నిర్ణయించింది. అందుకు తగినట్లుగా పార్క్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యవసర పనుల కారణంగా ఈ సంగీత కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని, ప్రేక్షకులను నిరుత్సాహ పరచినందుకు చింతిస్తున్నామని ఆ తర్వాత ఏఏఐ అధికారికంగా ట్వీట్‌ చేసింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top