కనకదుర్గమ్మ ఆలయంలో వెలుగులోకి మరో వివాదం

ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఇటీవల అమ్మవారికి అలంకరించిన ఖరీదైన చీర గల్లంతయింది. ఉండవల్లికి చెందిన పద్మజ అనే భక్తురాలు మహామంటపంలో అమ్మవారికి ఈ చీరను సమర్పించారు. ఈ చీర విలువ రూ. 18వేలు. ఉత్సవ విగ్రహానికి అలంకరించిన కొద్దిసేపటికే చీర కనిపించకుండా పోయింది. అమ్మవారికి ఎంతో భక్తితో సమర్పించిన చీరను.. ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలికి ఇచ్చారని భక్తులు ఆరోపిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top