ల్యాప్‌టాప్‌లు మాయం కేసులో అజయ్‌ చౌదరి అరెస్ట్‌  | Ajay Chaudhary Arrested For Laptop Theft Case In Sattenapalli | Sakshi
Sakshi News home page

Sep 13 2019 7:10 PM | Updated on Mar 21 2024 8:31 PM

సత్తెనపల్లి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు మాయమైన కేసులో  ఏ-2 నిందితుడు అజయ్‌ చౌదరిని సత్తెనపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌యిన నిందితుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా పనిచేశారు. ఈ కేసులో ఏ-1 నిందితుడైన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో 30 ల్యాప్‌టాప్‌లు మాయం అవ్వడంతో  ఆగష్టు 23వ తేదీన స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి బాజీబాబు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

పోల్

Advertisement