పయ్యావులపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఫైర్ | Sakshi
Sakshi News home page

పయ్యావులపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఫైర్

Published Sun, Sep 13 2015 6:25 PM

టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్పై వైఎస్ఆర్ సీపీ నేతలు విశ్వేశ్వర్రెడ్డి, శంకర్ నారాయణ, గుర్నాథ్రెడ్డి ఆదివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. ఉరవకొండలో పయ్యావుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని వారు ఆరోపించారు. 2009లో జరిగిన సూరయ్య హత్య కేసు నుంచి బయట పడేందుకు పయ్యావుల కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. సూరయ్య భార్య ఓబులమ్మకు చెందిన భూములను మరొకరి పేరుతో ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. పయ్యావుల ఆగడాలకు నిరసనగా ఈ నెల 16న బెలుగుప్పలో మహాధర్నా నిర్వహిస్తామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి, నేతలు శంకర్ నారాయణ్, గుర్నాథ్రెడ్డిలు వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement