జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మహత్మాగాంధీ, లాలూ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కాగా జగన్ రాకతో పార్టీ కార్యాలయం.... అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కిక్కిరిసింది. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాగా ఇడుపులపాయ నుంచి ఈరోజు ఉదయం జగన్ హైదరాబాద్ చేరుకున్నారు.
Oct 2 2013 2:52 PM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement